టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెళమవారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం ఆకుల అడుగు
భాగాన రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి పసుపు జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వేపనూనె ఒక ట్యాంక్ కు 30 ml చొప్పున వేసుకోవాలి. వేపనూనె నీటిలో కలవడానికి శాంపు ప్యాకెట్ వేసుకొని మిక్స్ చేసుకొని పిచికారీ చేయాలి.ఈ విధంగా చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు వచ్చే సమయంలో పెను బంక(చెక్కర తెగులు) ఉంది.దీని నివారణకు వేపనూనె ట్యాంక్ కు 35ml వేసుకొని పిచికారీ చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు తప్పనిసరిగా విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసి వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, అలాగే విత్తనం నుండి సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు.మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
About the author